ఇక ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తూ తెరకెక్కుతున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహా రాజా రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఇక ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన మేకర్స్ అభిమానులకి పూనకాలు తప్పని సరి అని అంటున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.ఇక వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తుంది మూవీ టీం. తాజాగా మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ డేట్‌ని అనౌన్స్ చేశారు. థియేటరికల్ ట్రైలర్ ని జనవరి 7 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ టైం మాత్రం ఇంకా తెలియజేయలేదు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జనవరి 8 వ తేదీన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 


ఫస్ట్ ఈ ఈవెంట్ ని వైజాగ్ ఆర్‌కె బీచ్‌లో అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భహిరంగ సభలుపై కొత్తగా విధించిన ఆంక్షాలతో మూవీ టీం ఇప్పుడు ఫుల్ గా కన్‌ఫ్యూషన్‌లో పడింది.అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ని వైజాగ్ సిటీలోనే ఆంధ్రా యూనివర్సిటీకి మార్చినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఇందుకు పోలీస్ వారు కూడా ఒకే చెప్పడంతో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏయూలో పెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా హాట్ బ్యూటీ శృతిహాసన్ నటిస్తుంది. స్టార్ ప్రొడక్షన్ కంపెనీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగ్‌స్టార్‌గా కనిపించబోతున్నాడు అని సమాచారం తెలుస్తుంది.మరి వరుస ప్లాపులతో డీలా పడ్డ చిరంజీవికి ఈ సినిమా ఎలాంటి హిట్ ని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: