టాలీవుడ్ లో మ్యాచ్ స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం గురించి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ ని చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమాని డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు .ఈ చిత్రానికి రామబాణం అనే ఒక పవర్ఫుల్ టైటిల్ని కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ఈ రామబాణం టైటిల్ ని ఖరారు చేయడం విశేషం అని చెప్పవచ్చు. ఈ టైటిల్ని వెండితెరపై రాముడు పాత్రలో పోషించిన బాలకృష్ణ, ప్రభాస్ నిన్నటి రోజున విడుదల చేశారు.


హ్యాట్రిక్ కోసం ఈ కాంబినేషన్ మరొకసారి రిపీట్ కాబోతోంది. గతంలో గోపీచంద్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం అంటే చిత్రాలు ఎంతటి ఘనవిజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో మరొకసారి వీరిద్దరూ కలిసి హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా టైటిల్ తో ఈ సినిమా పైన మంచి క్రియేట్ అవుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు టీజీ విశ్వప్రసాద్ ,వివేక్ కూచిబౌట్ల నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. నటిస్తూ ఉండగా జగపతిబాబు, కుష్బూ తదితర పాత్రలు నటిస్తూ ఉన్నారు.
ఫ్యామిలీ ఎమోషనల్ తో పాటు సామాజిక సందేశం తో కలిగిన కథఅంచంతో కలిగిన చిత్రం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం లో సరికొత్త గోపిచంద్ ను చూడబోతున్నారని డైరెక్టర్ శ్రీవాస్ తెలియజేస్తున్నారు. ఈ సినిమా కథని భూపతి రాజా అందించగా వెట్రి ఫలాని స్వామి చాయ్ గ్రహాన్ని అందిస్తున్నారట. ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నట్లు తెరుస్తోంది మరిచిత్రంతోనైనా గోపీచంద్ సక్సెస్ అవుతారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: