ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా స్టార్ హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి పెళ్లి బంధంతో ఒకటి అవుతున్నారు. ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. తాజాగా బాలీవుడ్లో మరొక ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యింది. తాజాగా కియారా అద్వానీ మరియు సిద్ధార్థ మల్హోత్రా మంగళవారం జైసల్మిర్ సూర్యగఢ్ ప్యాలెస్ లో ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహానికి గాను చాలా తక్కువ మంది స్నేహితులు రావడం జరిగింది. 

తక్కువ మంది కుటుంబ సభ్యులు మరియు చాలా కొంతమంది స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. అయితే సిద్ధార్థ మల్హోత్ర మరియు కియార వివాహం చాలా తక్కువ మంది ఆధ్వర్యంలో  పెళ్లి వేడుక జరిగింది.ఇందులో భాగంగానే ఆహ్వానం అందిన అతిధుల జాబితాలలో కొంతమంది సన్నిహితులు మాత్రమే ఉన్నారు.అయితే వీరి పెళ్లి జరిగినప్పటినుండి టాలీవుడ్  స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు కూడా వీరిద్దరి పెళ్ళికి హాజరయ్యారు అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు రావడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలోనే ఉపాసన ఎవరు ఊహించిన విధంగా ఒక షాక్ ఇచ్చింది.

తమ పెళ్ళికి రాలేకపోయామని ఉపాసన తాజాగా పేర్కొంది. అయితే ఇందులోభాగంగా  నూతన దంపతులకు సారీ అంటూ కూడా చెప్పకు వచ్చింది. కియార తమ వివాహ ఆల్బమ్ను సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది.ఇక వారు షేర్ చేసిన కొన్ని పోస్టులకి గాను ఉపాసన కామెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే వారు షేర్ చేసిన పోస్ట్ కిగాను కామెంట్ పెడుతూ.. అభినందనలు మీ జంట చాలా అందంగా ఉంది మేము మీ పెళ్లి మహోత్సవానికి హాజరు కాలేనందుకు మమ్మల్ని క్షమించండి మీరిద్దరూ ఎల్లప్పుడూ ఇంతే ప్రేమతో ఉండాలి అని ఆశిస్తున్నాను అంటూ పేర్కొంది ఉపాసన. ఇందులో భాగంగానే రామ్ చరణ్ కూడా... ఇది స్వర్గంలో జరిగిన మ్యాచ్ అని కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఉపాసనం మరియు రామ్చరణ్ వీరిద్దరి పెళ్ళికి హాజరు కాలేదని స్పష్టమవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: