ఇక హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేస్‌ ఛాంపియన్‌షిప్‌కు దేశావ్యాప్తంగా కూడా ప్రముఖ సెలబ్రిటీలు తరలిస్తున్నారు. ఇక మనదేశంలో మొదటిసారిగా ఈ ఈవెంట్ జరుగుతుండడం, అందుకు మహా నగరం హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడంతో సినీ ఇంకా క్రీడారంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రేస్‌ను చూసేందుకు వస్తున్నారు.ఇక ఈ రేసులో మొత్తం 11 జట్లు పోటీపడుతుండగా..అందులో మొత్తం 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. ఇండియా నుంచి మహీంద్రా, టాటా, టీసీఎస్ పోటీ టాప్ కంపెనీలు బరిలోకి దిగుతున్నాయి. ఇక ఈ రేసింగ్‌ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రేస్‌ కోసం హుస్సేన్‌ సాగర్‌ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ మార్గ్ లో సుమారు 2.8 కి.మీ. పొడవైన సర్క్యూట్ ని కూడా ప్రభుత్వం రెడీ చేసింది. ఇంకా అలాగే సుమారు 20 వేల మంది ప్రేక్షకులు ఈ రేస్‌ ను కూర్చుని చూసేలా ఏర్పాట్లు చేశారు. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 10) ఫార్ములా- ఈ రేస్‌ ప్రాక్టీస్‌ జరగగా ఈరోజు (ఫిబ్రవరి 11) ఉదయం క్వాలిఫయింగ్ రేస్‌ జరిగింది. 


ఇంకా అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రేసు స్టార్ట్ కాబోతుంది. ఇక దాదాపు గంటన్నర పాటు ఈ రేసు జరగనుంది.ఈ క్రమంలో ఫార్ములా- ఈ రేసింగ్ పోటీలను ప్రత్యక్షంగా చూసేందుకు పలువురు సెలబ్రిటీలు తరలివస్తున్నారు. శుక్రవారం నాడు నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి, జూనియర్‌ ఎన్టీఆర్ సతీమణి లక్మీప్రణతి ఇంకా అలాగే మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ వంటి ప్రముఖులు ఈ రేస్‌లో సందడి చేశారు. ఇక ఈరోజు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, మంత్రి కేటీఆర్‌ ఇంకా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, మహేశ్‌ బాబు కుమారుడు గౌతమ్‌ తదితరులు రేసింగ్ పోటీలకు హాజరయ్యారు. ఇక ఈ రేసుకోసం చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు సచిన్‌ టెండూల్కర్. హీరో రామ్‌ చరణ్‌తో కలిసి ఆయన ఫార్ములా-ఈ రేస్‌ దగ్గర సందడి చేశారు. ప్రస్తుతం సచిన్, రామ్ చరణ్ కలిసున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: