టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం లో రూపొందినటు వంటి ఈ మూవీ లో కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని కొంత కాలం క్రితం ఫిబ్రవరి 17 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన కాకుండా ఫిబ్రవరి 18 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇలా ఈ మూవీ విడుదల తేదీని ఈ మూవీ యూనిట్ ఒక రోజు వాయిదా వేసింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా నుండి తిరుపతి అనే సాంగ్ ను ఈరోజు సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క రన్ టైమ్  ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ 2 గంటల 18 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా సాధారణ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్న కిరణ్మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంత చేసుకుంటాడో చూడాలి. ఈ మూవీ పై ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: