టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రెసెంట్ ఉన్న విలన్స్ (పురుషులు) క్యారెక్టర్స్ కు ధీటుగా పవర్ ఫుల్ ఉమెన్ విలన్‏గా ఒక గుర్తింపు తెచ్చుకుంది మన  వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె క్రాక్ మూవీ లో జయమ్మగా తన విలనిజం బయట పెట్టింది.

దానితో ఆగకుండా ఆ తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీ లో  వరుస చిత్రాల్లోనూ నటిస్తోంది. అందమైన పవర్ ఫుల్‏ విలన్‎గా వరలక్ష్మి నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి మూవీ లో ప్రతినాయకురాలిగా ఆమె చేసిన నటన ఆ సినిమాకే హైలేట్ గా నిల్చింది. ఐతే ఇందులో తన నటనకు ఆమె ప్రశంసల వర్షం కురిపించుకుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న తమిళ్ చిత్రం కొండ్రల్ పావమ్. ఆ మూవీ తెలుగులో విడుదలైన అనగనగా ఓ అతిథి మూవీ కి రీమేక్ గా వస్తుంది.ఈ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఒక ముఖ ముఖి సంభాషణలో రివ్యూవర్స్ పై ఫుల్ ఫైర్ అయింది.

ఐతే ఇటీవల కొత్తగా ఏది విడుదల ఐనా సరే సోషల్ మీడియాలో తెగ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఆలా ఇచ్చేవాళ్ళల్లో వాటి మీద అసలు అవగాహనా లేని వాళ్ళు ఇస్తున్నారు.ట్రైలర్, టీజర్ చూసి పై వాళ్ల అభిప్రాయానా్ని చేప్పేస్తున్నారు. అర్థం పర్థం లేని రివ్యూలు ఇస్తూ ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నారు. అసలు రివ్యూలు ఇవ్వడానికి వాళ్లు ఎవరు ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చెప్పేస్తున్నారు. ఐతే అలాంటి వాళ్లందరినీ నేను ఒక్కటే అడుగుతున్నాను. అసలు మీరూ ఎలాంటి ఆశిస్తున్నారు ? ” అంటూ ఆమె రివ్యూర్స్ ని ప్రశ్నించింది. “మొదట్లో అందరూ వినోదం కోసం సినిమా చూసేవాళ్లు. బట్  ఇప్పుడు ఎంజాయ్ చేయడం వదిలేసి దానిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది మరింత ఎక్కువయ్యింది.

ఐతే ఒక మూవీ బాగుందా లేదా అని చెప్పేది కేవలం ఆడియన్స్ మాత్రమే కనుక వారిని చూసి ఆనందించనివ్వండి. చెత్త రివ్యూలతో వాళ్లను తప్పుదొవ పట్టించకండి. ఇదొక్కటే నా విన్నపం ” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఐతే ఇటీవల సినిమా కలెక్షన్స్ గూర్చి కూడా గొడవలు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు అని ఆమె ప్రస్నించింది జీవితం చాలా చిన్నది దాన్ని ఎంజాయ్ చేయండి అంటూ రివ్యూవర్స్ కు ఆమె చెప్పింది.ఐతే దీనికి సంబందించిన ఒక వీడియోను వరలక్మి ఆమె తన యొక్క సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: