టాలీవుడ్ లో బద్రి సినిమాతో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రేణు దేశాయ్. ఆ తర్వాత ఈ సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణాల చేత వివాహమైన కొద్ది రోజులకి విడిపోవడం జరిగింది. తాజాగా రేణు దేశాయ్ పలు షాకింగ్ విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని సైతం షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులంతా షాక్ లో ఉండిపోయారు.


ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రేణు దేశాయ్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా తన గుండెకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదట. ఈ క్రమంలోని వాటిని ఎదుర్కొనేందుకు తగిన శక్తిని కూడా పెట్టుకుంటున్నారని తనలాగా ఇబ్బంది పడే ఎంతోమందికి కూడా బలం చేకూరాలని కోరుకుంటున్నాను ఈ పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఎలాంటి కఠిన పరిస్థితులలో ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని ఎవరు కోల్పోకుండా చాలా దృఢంగా ఉండాలని ఏదో ఒక రోజు మనకు కచ్చితంగా ఫలితం వస్తుందని తెలియజేసింది రేణు దేశాయ్.


త్వరలోనే మామూలు మనిషిలా తిరిగి వస్తానని ఈ పోస్టులో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నేటిజెన్లు, సినీ ప్రముఖుల సైతం ఇమే ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ గా, డైరెక్టర్ గా, కాస్ట్యూమ్ డిజైన ర్ గా ఇలా మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా గుర్తింపు పొందింది రేణు దేశాయ్. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రియల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది రేణు దేశాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: