పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతి సంస్థ నిర్మిస్తున్న  సినిమా ప్రాజెక్ట్ కె. ఈ మూవీ మీద ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జనవరి 12 2024న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకరకంగా ప్రస్తుతానికి ప్రభాస్ ఒక రేంజిలో ఫ్యాన్ ఇండియా స్టార్ డం ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన చేసిన రాధేశ్యామ్ ఇంకా సాహో వంటి సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో ఏ మాత్రం ప్లాప్ అయినా ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి.ఒక పక్క ప్రాజెక్టు కే ఇంకా మరోపక్క ఆది పురుష్ ఇంకో పక్క సలార్ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులను ప్రభాస్ లైన్ లో పెట్టారు.మహానటి సినిమా దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కే సినిమా మీద దాదాపు అందరి చూపు అనేది ఉంది. ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ కేలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.


తాజా ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ ఈ విషయాన్ని బయటపెట్టినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక అత్యద్భుతమైన సినిమాగా నిలుస్తుందని ఆయన కామెంట్ చేసినట్టు సమాచారం తెలుస్తోంది.ఇక సీతారామం సినిమాని కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ మీదనే నిర్మించగా నాగ అశ్విన్ అలాగే అశ్వినీదత్ టీంకి దుల్కర్ సల్మాన్ కి బాగా క్లోజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీం ఆయనను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించగా ఏ మాత్రం తడబడకుండా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ సినిమాలో దుల్కర్ సల్మాన్ అదరపు ఆకర్షణ అవుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పఠానీ వంటి హీరోయిన్లు నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: