సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ 28వ సినిమాగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. హారిక హాసిని బ్యానర్ లో రూపొందే ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే తో పాటుగా ధమాకా బ్యూటీ శ్రీలీల కూడా హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో 3 వ హీరోయిన్ గా బాలీవుడ్ భామ భూమి పడ్నేకర్ కూడా నటిస్తుందని టాక్.

ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా రెండవ షెడ్యూల్ త్వరలో మొదలు పెట్టనున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ కి ముహుర్తం ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఉగాది రోజున మహేష్ 28వ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందట. టైటిల్ ఏంటన్నది కూడా ఆరోజు రివీల్ చేస్తారట. మార్చి 22న మహేష్ సినిమా టైటిల్ రివీల్ కాబోతుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ నుంచి ఆగష్టుకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. ఆగష్టు 11న మహేష్ త్రివిక్రం మూవీ రిలీజ్ ప్లాన్ చేశారు.

ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. వరుస మ్యూజిక్ హిట్స్ ఇస్తున్న థమన్ ఈ సినిమాకు కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో త్రివిక్రం ప్రతీది చాలా గ్రాండ్ గా ఉండేలా చూస్తున్నారు. మహేష్ త్రివిక్రం సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. త్రివిక్రం తో పాటుగా చిత్రయూనిట్ అంతా కూడా సినిమాపై చాలా హోప్స్ తో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెషన్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాకు సిద్ధమవుతున్నాడు మహేష్. ఆ సినిమా మహేష్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: