ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో ఆది పురుష్ చిత్రం కూడా ఒకటి. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ప్రభాస్ నటిస్తున్న మొట్టమొదటి హిందీ చిత్రంగా ఇది తెరకెక్కిస్తూ ఉండడం విశేషం. రామాయణం ఆధారంగా ఈ సినిమాని డైరెక్టర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్తో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పూర్తిస్థాయి గ్రాఫిక్స్ చిత్రంగా తెరకెక్కించారు.


ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా విజువల్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో ఆరు నెలల పాటు వాయిదా వేయడం జరిగింది చిత్ర బృందం. జూన్ 16న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం డేట్ కూడా విడుదల చేయడంతో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోయే సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా పైన ఆసక్తి నెలకొంది.అయితే ఈ సమయంలోనే షారుక్ ఖాన్ జవాన్ సినిమా కూడా విడుదల చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.

సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. జవాన్ సినిమా అక్టోబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఒకవేళ పోటీలో ఉండి ఉంటే కచ్చితంగా అది పురుష్ చిత్రానికి కొంత మైనస్ అయి ఉండేది. ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో కొంతమంది ఈ సినిమాకి కాస్త ప్లసే అన్న మాటలు వినిపిస్తున్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి ఇప్పటివరకు రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదలయ్యాయి కానీ ఇవి కూడా డిజాస్టర్ గా మిగిలాయి ఇది ఎంత అభిమానులు మొత్తం తీవ్ర నిరాశలో ఉన్నారు అందుకోసమే ఆది పురుష్ చిత్రం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: