
ఇకపోతే తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది కాలం ఫిక్స్డ్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షదాయకం. ఇకపోతే రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే ఇన్వెస్టర్లకు ఒక ఏడాది కాలం డిపాజిట్ పై ఏడు శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది . ఇకపోతే ఇది కేవలం ఇంతకుముందు ఆరు శాతంగా ఉండగా ఇప్పుడు 100 బేసిస్ పాయింట్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక పెంచిన వడ్డీ రేట్లు మే 26 నుంచి అమలులోకి వచ్చినట్లుగా కూడా ప్రకటించింది. ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు పై మూడు శాతం నుంచి ఏడు శాతం వరకు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది.
ఇక 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ గా.. ఏడాదికాలం ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.5% వడ్డీ అలాగే 80 సంవత్సరాల నిండినవారికి సూపర్ సిటిజన్స్ గా 7.65% ఏడాదికి వడ్డీ ఇస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఇక తాజాగా వడ్డీరేట్ల సవరణ 7 శాతానికి పెరగడం నిజంగా మంచి అవకాశమని చెప్పాలి.. కొత్త వడ్డీ రేట్లు ఎన్నారై , ఎన్నార్ ఈ, దేశీయ డిపాజిట్లకు వర్తిస్తాయని కూడా బ్యాంకు స్పష్టం చేసింది.