కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ భారతీయుడు సినిమా సీక్వెల్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే..దాదాపు ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన సినిమా కి ఇప్పుడు సీక్వెల్ చేయడం పెద్ద రిస్క్ అయినా శంకర్ ఈ సినిమా ని తనదైన స్టైల్ లో తెరకెక్కించబోతున్నాడని అన్నారు.. ఇక ఈ సినిమా ను ఏ ముహూర్తాన మొదలుపెట్టాడొ తెలీదు కానీ ఆదినుంచి ఈ సినిమాకి అన్ని అడ్డంకులు వస్తున్నాయి.. మొదట్లో నిర్మాతలకు, శంకర్ చెడింది.. ఆ తర్వాత అన్ని సమస్యలు సద్దుమణిగి సినిమా షూటింగ్ మొదలైంది.. ఆ తర్వాత సినిమా లో జరిగిన ఓ ప్రమాదం లో ఇద్దరు సినీ కార్మికులు చనిపోయారు.. దాంతో ఈ సినిమాలోని విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి.. కరోనా వల్ల ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇప్పటివరకు తిరిగి ప్రారంభం కాలేదు.. అన్ని సినిమాలు చక చక షూటింగ్ కి వెళ్లిపోతుంటే శంకర్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయట్లేదు..