సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కార్ వారి పాట' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ కొట్టిన పరశురామ్ ఈ సినిమా కి దర్శకుడు. చాల వెరైటీ గా ఈ కథ ఉండబోతుందని అంటున్నారు.. మహేష్ బాబు కెరీర్ లోనే వెరైటీ కథగా రాబోతున్న ఈ సినిమా కి పరశురామ్ టాలీవుడ్ లో ఇంతవరకు రానటువంటి స్టోరీ తో చేస్తున్నాడట.. సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సుకుమార్ ని కాదని మరీ చేస్తున్న ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని మహేష్ బాబు కూడా సినిమా పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట..