నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే పాత్ర ప్రేరణ ఫస్ట్ లుక్ ని ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే రిలీజ్ చేయగా, ప్రభాస్ పుట్టిన రోజు సంఘర్భంగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.. ఈ పోస్టర్ లకి మంచి స్పందన లభించింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది..కరోనా కారణంగానే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు కదల్లేదు.. దాంతో ఆటోమేటిక్ గా సినిమా రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ ఐయ్యింది.