రీ ఎంట్రీ లో ఖైదీ నెంబర్ 150 సినిమా తో అదిరిపోయే హిట్ కొట్టి సైరా తో ఆ హిట్ జోష్ ను కంటిన్యూ చేసిన మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో నటిస్తున్నారు.. కొరటాల శివ దర్శకుడు.. మెసేజ్ ని కమర్షియల్ సినిమాలకు జోడించి మంచి హిట్లు కొట్టే కొరటాల శివ ఈ సినిమా లోనూ అలాంటి మెసేజ్ ని ఇమిడించి పక్కా మాస్ మసాలా సినిమా ని తెరకెక్కిస్తున్నాడట.. ఈ సినిమా వేసవికి రిలీజ్ అవుతుండగా తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు. చిరు రికమెండేషన్ తో ఈ సినిమా మణిశర్మతో కొరటాల శివ చేస్తున్నాడని తెలుస్తుంది.. ఇక మొదటినుంచి మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే..