మెగా హీరో , సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఉప్పెన..సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతుంది.. లాక్ డౌన్ కన్నా ముందే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా థియేటర్లు లేని కారణంగా సినిమా ని ఇప్పటివరకు రిలీజ్ చేయకుండా ఉంచారు.. OTT నుంచి ఎన్ని ఆఫర్స్ లు వచ్చినా రిలీజ్ చేయకుండా ఉంచారు. వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా కావడంతో సినిమా ను థియేటర్లలో రిలీజ్ చేయాలనీ ఇన్నాళ్లు వెయిట్ చేశారు.