జబర్దస్త్ షో తో అనసూయ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. గత ఏడేళ్లుగా అనసూయ ఈ షో కి యాంకరింగ్ చేస్తూ బాగానే ఆర్జించింది కూడా.. ఇక్కడ వచ్చిన పాపులారిటీ తోనే అనసూయ వెండితెరపై కూడా నటించడం మొదలుపెట్టింది.. ప్రస్తుతం ఆమె వెండితెరపై కూడా ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అక్కడ కూడా క్లిక్ అవడంతో ఆమెకు ఎదురు లేకుండా పోయింది.. దర్శక నిర్మాతలు ఆమె కోసం ప్రత్యేక పాత్ర లు రాసి ఆమెను నటింపచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హీరోయిన్ ల కు సమానంగా ఆమెకు రెమ్యునరేషన్ లు ఇచ్చి మరీ తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు..