ఆటగదరా శివ సినిమా తో తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ ను అందుకున్న హీరో ఉదయ్ శంకర్. తొలి సినిమా తోనే వైవిధ్యభరిత కథతో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్న ఉదయ్ రెండో ప్రయత్నంగా చేసిన ‘మిస్మ్యాచ్’ తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన మూడో సినిమా గా క్షణ క్షణం సినిమా తెరకెక్కింది. థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమా కి కార్తీక్ మేడికొండ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ చిత్రం పై ముందునుంచి అంచనాలు ఉండగా ఆ అంచనాలను ఈ సినిమా ఈమేరకు అందుకుందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం..