నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను వరుసగా చేసుకుంటూ పోతున్న ప్రభాస్ వీటిలో రాధే శ్యామ్ ని ముందుగా రిలీజ్ చేయబోతుండగా అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.. ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా ని నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాల కన్నా ముందు చేస్తున్నాడు ప్రభాస్.