ప్రముఖ బ్యాడ్మింటన్ క్రిడాకారిణి సైనా నెహ్వాల్
జీవిత చరిత్ర ఆధారంగా
సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ
సినిమా కి మొదటి నుండి అనేక ఆటంకాలు చుట్టూ ముడుతున్నాయి. ఈ
సినిమా హీరోయిన్ విషయంలో చాలా పెద్ద చర్చ జరిగింది. మొదట
బాలీవుడ్ నటి శ్రద్దకపూర్ నటిస్తుందని వార్తలు వచ్చాయి ఆ తరువాత
సమంత నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ చివరికి ఈ
సినిమా లో ప్రముఖ బాలీవుడ్ నటి పరిణితి చోప్రా నటిస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది.
ఈ
సినిమా కోసం
పరిణితి చోప్రా చాలా కష్టపడుతుంది. ఆమె ఈ
సినిమా కోసం చాలా బరువు కూడా తగ్గింది. గత కొన్ని రోజులుగా ఆమె బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకుంటుంది. పతిణితి చోప్రా రోజులో ఎక్కవ సమయం బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తుంది. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా పరిణితి చోప్రా గాయపడ్డారు. .ఆమె మెడ వెనుక భాగం ఫోటో ను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. నేను మరియు చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం . కానీ అనుకోకుండా గాయపడ్డాను. తగినంత విశ్రాంతి తీసుకోని మళ్ళీ బ్యాడ్మింటన్ శిక్షణ మొదలుపెడుతాను అని ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
మరో నెల రోజుల్లో ఈ
సినిమా షూటింగ్ మొదలవనుంది ఇలాంటి సమయంలో
పరిణితి చోప్రా గాయపడటంతో
సినిమా షూటింగ్ ఆలస్యం కావచ్చు అని టాక్ వినబడుతుంది. ఈ
సినిమా ను ప్రముఖ
రచయిత, దర్శకుడు అమోల్ గుప్తా దర్శకత్వం వహించనున్నాడు. అమోల్ గుప్తా దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ మరియు మానవ్ కౌల్ లు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను
2020 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.