మహేశ్ బాబు కెరీర్లో ఒక్కడు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో చెప్పనవసరం లేదు. 2003 సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఒక్కడు సినిమా ఆ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఒక్కడు సినిమాలో కొంతభాగం కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్ దగ్గర తెరకెక్కింది. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర షూటింగ్ జరుపుకున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘనవిజయం సాధించాయి. 
 
ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి పండుగ సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ఉండటంతో పాటు కర్నూలు కొండారెడ్డి బురుజు లాంటి సెట్ దగ్గర నిర్మాణం జరుపుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీలో కొండారెడ్డి బురుజు సెట్ వేసి సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేశ్ బాబు ఒక్కడు సినిమా సెంటిమెంట్ ను సరిలేరు నీకెవ్వరు రిపీట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాడు. 
 
నవంబర్ 22వ తేదీ సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఈ టీజర్ మరింతగా అంచనాలు పెంచింది. టీజర్ లో మహేశ్ బాబు చెప్పిన డైలాగ్స్ తో పాటు ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదట ఈ సినిమాను జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ జనవరి 11వ తేదీకి రిలీజ్ డేట్ ను మారుస్తున్నట్లు ప్రకటన చేసింది. 
 
మహేశ్ బాబుకు జోడీగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తోంది. ఎఫ్ 2 హిట్ తరువాత అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 100 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: