బొమ్మరిల్లు, ఓయ్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమా లో నటించిన హీరో సిద్ధార్థ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ‘బోయ్స్’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా తో బాగా దగ్గరైపోయారు. ఆ తరవాత ‘బొమ్మరిల్లు’ సినిమా తో తెలుగు లో తన మార్కెట్ను బాగా పెంచుకున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓయ్’ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయ్. అయితే, తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న తెలుగులో అవకాశాలు లేక ఎక్కడి కో వెళ్ళిపోయాడు..
చాలా రోజుల తరవాత సిద్ధార్థ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నారు. ఈసారి ఒక వైవిధ్యమైన కథ తో సినిమాను సిద్ధం చేస్తున్నారు. టైటిల్ కూడా కొత్త గా ఉంది.. ‘టక్కర్’. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తిక్ జి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ చిత్రాని కి టక్కరి అని టైటిల్ ను పరిశీలంచినట్లు ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్పై సుధన్ సుందరం, జయరాం నిర్మిస్తోన్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటి కే ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తు్న్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
టక్కర్’ టైటిల్ పోస్టర్ కమ్ ఫస్ట్ లుక్ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘టక్కర్’ పోస్టర్ను వరుణ్ విడుదల చేయడం వల్ల ఈ సినిమాకు మంచి ప్రచారం కల్పించినట్టయింది.