బోయపాటి బాలకృష్ణల కాంబినేషన్ లో మూడవసారి హిట్ కొట్టడమే లక్ష్యంగా ప్రారంభం అయిన మూవీకి ఇంకా ఒక షెడ్యూలు కూడ పూర్తి కాకుండానే కష్టాలు మొదలయ్యాయి. బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘రూలర్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో బాలయ్య మార్కెట్ విపరీతంగా పడిపోవడంతో ఈ మూవీ నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డిమూవీ బడ్జెట్ విషయంలో భయపడి వెనకడుగు వేయడంతో రంగంలోకి దిగిన బాలయ్య నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు బాలకృష్ణ తన పారితోషికాన్ని 5 కోట్లకు తగ్గించుకున్నట్లు సమాచరం. అంతేకాకుండా తన పారితోషికం ఈ మూవీ మార్కట్ పూర్తి అయిన తరువాత ఇమ్మని చెప్పడమే కాకుండా దర్శకుడు బోయపాటి పారితోషికాన్ని కూడ సగం వరకు తగ్గించేలా చేసి ఈ మూవీ ఆర్ధిక కష్టాలకు పరిష్కారం వెతికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం లీక్ అవుతున్న వార్తల ప్రకారం బాలకృష్ణ ఈ మూవీలో వచ్చే ఒక ఫ్లాష్ బ్యాక్ లో వారణాసిలో ఉండే అఘోర పాత్రలో గుండు తో చాల భయంకరంగా కనిపిస్తాడని టాక్. బాలయ్య అఘోరా గా ఎందుకు మారాడు అన్న ఫ్లాష్ బ్యాక్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ మూవీలో బాలయ్య పాత్రకు మూడు షేడ్స్ ఉండటంతో ప్రతి పాత్రకు సంబంధించి డిఫరెంట్ లుక్ లో బాలయ్య కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో అత్యంత కీలకమైన బాలయ్య స్నేహితుడు పాత్ర కోసం సునీల్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం కామెడీ టచ్ మాత్రమే కాకుండా సునీల్ లోని నటుడుని బయటపెట్టే పాత్ర ఇది అని అంటున్నారు. ఈ నెల విడుదలైన ‘అల వైకుంఠపురములో’ ‘డిస్కో రాజా’ మూవీలు సునీల్ కు కలిసిరాక పోయినా బాలయ్య బోయపాటి మూవీ అయినా కలిసి వచ్చి సునీల్ కు మళ్ళీ టర్నింగ్ వస్తుందో లేదో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: