'అల వైకుంఠపురములో' ఇండస్ట్రీ హిట్ గా మారడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ కన్నా సుకుమార్ చాల ఆనందంగా ఉన్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘రంగస్థలం’ హిట్ తరువాత మహేష్ దగ్గర ఊహించని పరాభవం ఎదురు కావడంతో అల్లు అర్జున్ ను తన సినిమా కథకు ఒప్పించు కోవడానికి చాల కష్టపడవలసి వచ్చింది అని అంటారు. 

ఎట్టకేలకు ‘అల వైకుంఠపురములో’ మూవీ విడుదలకు ముందే సుకుమార్ తన మూవీ షూటింగ్ ను మొదలు పెట్టాలని భావించినా అల్లు అర్జున్ ‘అల’ మూవీ ప్రమోషన్ లో విపరీతంగా బిజీ కావడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ‘అల’ మూవీ ఊహించిన స్థాయికన్నా ఎన్నో రెట్లు భారీ విజయాన్ని అందుకోవడంతో బన్నీ రిలాక్స్‌ అయిపోయి సుకుమార్‌పై ఒత్తిడి పెట్టరాదని డిసైడ్‌ అయ్యాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనితో సుకుమార్ కు ఈ సినిమా కథకు సంబంధించి తుది మెరుగులు దిద్దుకోవడానికి సుకుమార్ కు తగినంత సమయం ఇవ్వాలని ప్రస్తుతం బన్నీ అనుకుంటున్నట్లు టాక్. 
దీనికితోడు బన్నీ తన గెటప్‌ ఛేంజ్‌ చేసుకోవడం కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది. దీనితో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం మార్చికి కాని  ఏప్రియల్ కు కానీ వాయిదా పడే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

వాస్తవానిక సుకుమార్‌ స్వతహాగానే కాస్త స్లోగా సినిమాలు తీస్తాడు కాబట్టి ఇప్పుడు బన్నీ తొందర పెట్టకపోవడంతో సుకుమార్ మంచి జోష్ లో ఉన్నట్లు టాక్. అదే ఊహించని విధంగా ‘అల వైకుంఠపురములో’ ఈ స్థాయి విజయం సాధించకపోతే సుకుమార్ కు బన్నీ పెట్టె టార్చర్ ఒక రేంజ్ లో ఉండి ఉండేది అంటూ ఇండస్ట్రీలో జోక్స్ వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేయడంతో సుకుమార్ పడవలసిన టార్చర్ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కు తప్పదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: