టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత మొదటి సినిమా నుండి కూడా కెరీర్ పరంగా నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు అందుకోవడం జరిగింది. ఇక గత ఏడాది యు టర్న్, ఓ బేబీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత, ఈ ఏడాది శర్వానంద్ తో కలిసి నటించిన జాను అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండేళ్ల క్రితం తమిళ్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న 96 అనే ప్రేమకథా చిత్రానికి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, శర్వానంద్ తమ ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించడం జరిగింది. 

 

ఇక ఈ ఏడాది ప్రారంభంలో నటించిన తన సినిమా మంచి విజయం సాధించడంతో హీరోయిన్ సమంత సహా సినిమా యూనిట్ మొత్తం కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇకపోతే సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని నిన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేసుకుంది సినిమా యూనిట్. అయితే ఆ సందర్భంగా అక్కడికి చేరుకున్న జాను యూనిట్ ని చూసేందుకు స్థానిక భక్తులు ఎగబడ్డారు. అయితే వారి దర్శనం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో హీరోయిన్ సమంతను పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఇక అదే సమయంలో ఒక లేడీ ఫ్యాన్ ఆమె చేతిని పట్టుకుని చాలా సేపు చేయి వదలకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమె చేతిని వెంటనే లాగేసారు. 

 

అనంతరం ఒక అభిమాని ఏకంగా ఐ లవ్ సమంత అంటూ గట్టిగా అరవడంతో సమంత సహా అక్కడి వారందరూ కూడా ఒక్కసారిగా కొంత నిర్ఘాంతపోయారు. ఆ ఘటన అనంతరం ఫ్యాన్స్ అరుపులు, కేకలతో ముకురిసిపోయి ఒక నవ్వు నవ్విన సమంత, కాసేపటికి వెళ్లిపోయింది. అయితే ఆ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతుండడంతో కొందరు ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆ ఘటనపై మండిపడుతున్నారు. ఆమె హీరోయిన్ అయినప్పటికీ, అది గుడి ప్రాంగణం అని మరిచి ఆమెను ఉద్దేశించి ఐ లవ్ యు అని అరవడం నిజంగా ఘోరం అని, రాను రాను ఎక్కడ ఏమి మాట్లాడాలో కూడా కొందరికి తెలియకుండా పోతోందని, ఆ అరిచిన వ్యక్తిని ఉద్దేశించి పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: