టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్నేళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయమై మంచి పేరు దక్కించుకొని, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు గా మారి పలు పాత్రల్లో నటించి మరింత మంచి పేరుతో ముందుకు కొనసాగుతున్న వారు ప్రస్తుతం కొందరు ఉన్నారు. ఇక అటువంటి వారిలో ఎంతో గొప్ప పేరుతో దూసుకెళ్తున్న సీనియర్ నటి రమ్యకృష్ణ ఒకరు అనే చెప్పాలి. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ని వివాహం చేసుకున్న అనంతరం ఆ మధ్య కొన్నాళ్లపాటు చాలా సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేసిన రమ్యకృష్ణ, ఆపై స్పీడ్ పెంచి పలు సినిమాల్లో ని అత్త, అమ్మ వంటి ప్రధాన పాత్రల్లో నటిస్తూ దూసుకెళ్లింది. ఇక ఇటీవల టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాల్లో రాజమాత శివగామి దేవి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి గొప్ప పేరు గడించిన రమ్యకృష్ణ కు, 

 

అక్కడి నుండి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ, కొద్దిరోజుల క్రితం ఒక బడా ఆఫర్ ని వదులుకున్న ట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ కు సీక్వెల్ గా ప్రస్తుతం తెరకెక్కుతున్న కేజిఎఫ్ 2 సినిమాలోని ప్రధానమంత్రి పాత్రైన రమిక సేన్ పాత్రకు మొదట దర్శకుడు ప్రశాంత్ నీల్ రమ్యకృష్ణనే తీసుకోవాలని భావించి, ఆమె వద్దకు వెళ్లారట. అయితే ఆ పాత్ర తనకు ఎంతో నచ్చడంతో తప్పకుండా నటిస్తానని చెప్పిన రమ్యకృష్ణ, భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని,

 

అయితే ఆమె కోరినంత భారీ పారితోషికాన్ని ఇవ్వలేనని చెప్పి, వెనుతిరిగిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆమె స్థానంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ ని తీసుకోవటం జరిగిందని అంటున్నారు. అయితే ఈ వార్త పై ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేనప్పటికీ, ఇది ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో, పలువురు నెటిజన్లు రమ్యకృష్ణ ను ఉద్దేశించి, ఛ ఎంత గొప్ప పేరు వస్తే మాత్రం, భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేసి టెక్కు ప్రదర్శించటం నీకు సరైనది రమ్యకృష్ణ అంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: