శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మెన్ గా ఒక వెలుగు వెలిగి అనుకోకుండా ఒక ఆడియో టేపుల వ్యవహారంలో చిక్కుకుని తన పదవితో పాటు తన ఇమేజ్ ని కూడ పృథ్వీ పోగొట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. 


తనను ఒక పధకం ప్రకారం ఈ వివాదంలో ఇరికించారు అని చెపుతూ పృథ్వీ ఈ వివాదం జరిగిన తరువాత కనీసం తనను ఎవరు పలకరించడం లేదు అంటూ తన ఆవేదనను వ్యక్త పరిచాడు. అంతేకాదు తనకు సినిమాలలో అవకాశాలు కూడ ఇవ్వడం లేదనీ తనను ఒక నేరస్థుడిగా చూస్తూ తనను పక్కకు పెడుతున్న వారిని చూస్తుంటే తాను ఒక తీవ్రవాదిన అన్న సందేహం కలుగుతోంది అంటూ పృథ్వీ భావోద్వేగంతో కామెంట్ చేసాడు. 


ఇదే సందర్భంలో పృథ్వీ చిరంజీవిని ఆకాశంలోకి ఎత్తేస్తూ గతంలో తనకు ఇలాంటి ఒక సమస్య ఎదురైనప్పుడు తనకు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని భావించినప్పుడు తన పరిస్థితి గ్రహించిన చిరంజీవి తనకు సపోర్ట్ గా నిలబడకపోతే ఈ పాటికే తాను ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని అంటూ కామెంట్ చేసాడు. రాజకీయాలలో తన ఎదుగుదల చూసి గిట్టని వారు మాత్రమే తన పై ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేస్తూ తనను అనవసరపు విషయాలలో ఇరికించారు అంటూ పృథ్వీ గగ్గోలు పెడుతున్నాడు. 


‘పోకిరి’ సినిమాలో ఎలాగైతే రౌడీలు ఇలియానా బట్టలు చింపేసి ఇక నీకు రేప్ అయిపోయిందని చెప్పి వెళ్లిపోతారో ఇప్పుడు తన పరిస్థితి అలా ఉంది అని చెపుతూ తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు బ్రతికి సాధించలేరని చెపుతూ పృథ్వీ శాపాలు పెడుతున్నాడు. నిరంతరం సంచలన కామెంట్స్ కు చిరునామాగా కొనాగే పృథ్వీ ఇప్పుడు సినిమా రంగంలో మళ్ళీ అవకాశాలు తెచ్చుకుని రాణించలేకపోతే రానున్న రోజులలో పృథ్వీ పూర్తిగా కనుమరుగు అయిపోయే ఆస్కారం ఉంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: