ఓవైపు మహేష్ బాబు సినిమాలు సూపర్ హిట్లని, బంపర్ హిట్లని.. కలెక్షన్లు అన్ని కోట్లని, ఇన్ని కోట్లని సోషల్ మీడియాలో ఊదర కొడుతుంటే... ఇక ఆ సదరు కలెక్షన్ల వివరాలన్నీ ఫేక్ అనే వార్తలు కూడా రావడం మనం ఇటీవల గమనించవచ్చు. దానికి ఉదాహరణే.. ఇటీవల ఆయన నటించిన `సరిలేరు నీకెవ్వరు.` ఈ సినిమా కలెక్షన్ల వివరాలు నిజం కాదనే కామెంట్స్ చాలా మాధ్యమాల్లో రావడం మనం చూడవచ్చును. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గాని, ఈ విషయాన్ని మన సూపర్ స్టార్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు వినికిడి.

 

ఇక దాని పర్యవసానమే మహేష్ నెక్స్ట్ మూవీ ఏంటి అనేది ప్రశ్నలా మారింది. బాబు కూడా ఈ విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారట! ఇక దీనిపైన రక రకాల ఊహాగానాలు వున్నాయి. తదుపరి మూవీ వంశీ పైడితల్లని.. అతను చెప్పిన లైన్ కొత్తగా లేకపోవడంతో ఇపుడు పరశురామ్ ను మహేష్ లైన్ లో పెట్టాడని.. టాలీవుడ్ కోడై కూస్తోంది. దీనిపైనే పరుశురామ్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని, ఇక వంశీ తో మూవీ లేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక నిజా నిజాలు తెలియని అభిమానులు సందిగ్ధంలో పడ్డట్టు సూచనలు.. 

 

IHG

 

ఇలాంటి పరిస్థితుల నడుమ, పరశురామ్ ఇటీవల నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇక దాన్ని అధికారికంగా కూడా ప్రకటించిన సంగతి మనకు విదితమే. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్నను ఖరారు చేసుకున్నట్లుగా కూడా ఈమధ్య సమాచారం వచ్చింది.. ఇక నాగచైతన్యతో పరుశురాం బిజీ అయితే మహేష్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న... ఇక చేసేదేమీలేక, పాత బాటే పడతాడా... అనేది అందరిలోనూ నెలకొనుంది. 

 

ఇన్ని డైలమాల నడుమ సూపర్ స్టార్ మహేష్, ఓ కొత్త డైరెక్టర్ తో ... ఓ సరిక్రొత్త సబ్జెక్టు తో తన అభిమానులు ముందుకు రాబోతున్నాడని తాజా సమాచారం. ఇక అసలు విషయం సంగతి ఎలా వున్నా... మహేష్ అభిమానులు మాత్రం తన సూపర్ హీరోజేమ్స్ బాండ్ తరహా కథతో... ఇండస్ట్రీని ఏలడానికి వస్తున్నాడంటూ... ఈ సినిమాతో ఇంతవరకు వున్న రికార్డులు తుడుచు పెట్టుకు పోతాయంటూ... వారు చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: