బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఇండియాలోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి హోలీ పండుగను తమ కుటుంబ సమేతంగా చాలా సంతోషంగా జరుపుకుని వారి వేడుకలకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇటీవల ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాని ఫాలో దారుల సంఖ్య ఐదు కోట్ల కు చేరుకుంది. వాస్తవానికి భారత దేశంలో ఏ సెలబ్రిటీ కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రియాంక చోప్రా కి ఉంది.




ఆమె పాపులారిటీ ఇంతగా ఎదిగే పోవడానికి గల కారణం... సినిమాలలో తన చూపించే నటన టాలెంట్ అని, ఇంకా తన తన విపరీతమైన ఎక్స్పోజింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా తన పాపులారిటీ తనకు ఎన్ని డబ్బులు తెచ్చి పెడుతుందో ఒక వార్త తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

 




విషయానికి వస్తే... హైపర్ హెచ్ క్యూ సంస్థ ని ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అయితే హైపర్ హెచ్ క్యూ సంస్థ ని ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో ప్రమోట్ చేయడానికి ప్రియాంక చోప్రా అక్షరాలా రెండు కోట్ల రూపాయలు తీసుకుంటుందట. ఈ నిజాన్ని సదరు బడ సంస్థ ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేస్తోంది. నెలలు, నెలలు కష్టపడి ఒక సినిమా తీసినందుకు కూడా నేటితరం మిడిల్ రేంజ్ హీరోలు రూ. 2కోట్ల పారితోషికం అందుకోవడం లేదు.




కానీ 30 నిమిషాలు కూడా కష్టపడకుండా రెండు కోట్ల రూపాయలను ప్రియాంక చోప్రా సంపాదిస్తుందంటే ఆమెకి ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కెరీర్ మొదటిలో ఎన్నో కష్టాలు పడిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఒక మహారాణి లాగ తన జీవితాన్ని గడుపుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రియాంక చోప్రా ప్రస్తుతం 'ది మ్యాట్రిక్స్ 4', 'ది వైట్ టైగర్' సినిమాలో కీలకమైన పాత్రలలో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: