టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో దూకుడు పెంచుతున్నాడు. ఈ మధ్యన వరుస సినిమాలలో నటిస్తున్నాడు. ఒకదాని తర్వాత మరొక కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నారు రవితేజ. అయితే.. తాజాగా మాస్ మహారాజ మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ దర్శకుడు ఎవరో కాదు.. ఒక స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకుని ఎన్నో హిట్ సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ. కాగా., వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించడానికి రవితేజ తన నెక్స్ట్ మూవీ ఈయనతో చేసేందుకు ఓకే చెప్పారని సమాచారం.

 

 

అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటించిన చిత్రం 'నా పేరు సూర్య'.. నా ఇల్లు ఇండియా అనే సినిమాను వక్కంతం వంశీ తెరకెక్కించి డైరెక్టర్ గా మారారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేక పోయింది. దీంతో ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీ మరో కథపై పని చేస్తున్నారట.

 

 

అయితే.. వంశీ తయారు చేసిన స్క్రిప్ట్ ను యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్ లో ఉంటుందట. ఈ కథను మాస్ రాజాకు వినిపించడం.. ఆయనకు నచ్చడం.. ఈ ప్రాజెక్ట్ ను రవితేజ ఒకే చేయటం జరిగిందట. గతంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాలకు వక్కంతం వంశీ రచయితగా పని చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం.

 

 

మరి వక్కంతం వంశీ తన రెండవ ప్రయత్నంలో అయినా విజయం సాధిస్తారా..?? లేదా అనేది వేచి చూడాల్సిందే.. ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెకకిస్తున్న 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా., ఈ సినిమాను చిత్ర యూనిట్ మే లో విడుదల చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: