ఇజా బెల్లె అని పిలవటం కంటే.. వరల్డ్ ఫేమస్ లవర్ హీరోయిన్ అని చెప్తే తెలుస్తుంది కాబోలు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు దక్షిణ చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలానే ఇజా బెల్లె మిస్టర్ మజ్నులో కూడా నటించింది. ప్రస్తుతానికి ఈమె లాంటి చాలా మంది నటీమణులు భారత చిత్ర పరిశ్రమకు వచ్చి తమ నటనతో మంచి పేరు తెచ్చుకుని ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఇజా బెల్లె బ్రెజిల్ కు చెందిన యువతి. ఈమె పుట్టి పెరిగింది మొత్తం బ్రెజిల్ లోని జొం పెసవా అనే నగరంలోనే నని చెప్పింది ఇజా. ఈమె ఇండియాలో మోడలింగ్ చేస్తున్నప్పుడు బాలీవుడ్ నటి కరీనా కపూర్ దృష్టిలో పండిందట. అలా ఆమెకు తలాష్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని ఇజా బెల్లె చెప్పింది.


అయితే.. ఇజా బెల్లె చదువు అయిపోయేసరికి ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేదని. తాను ఏదో ఒక జాబ్ ను చూసుకుని సంపాదన మొదలు పెట్టాలనుకుంది. అలాంటి పరిస్థితులలో ఇజా బెల్లెకి ఇండియాలో మోడలింగ్ లో అవకాశాల గురించి తెలుసుకుందట. ఇండియాకు వెళ్తాను అని వారి కుటుంబ సభ్యులకు చెప్తే వారు ఒప్పుకోలేదు అని చెప్తోంది ఈ బ్రెజిల్ భామ. కానీ ఎలాగోలా ఒప్పించి నెం మల్లి త్వరగా తిరిగి వస్తానని వచ్చి చెప్పి వచ్చింది.  
ఈమెకు ఇండియాలో మోడలింగ్ ప్రారంభించిన తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 


అలా వచ్చిన సినిమాలే.. మిస్టర్ మజ్ను, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాల్లో నటించానని ఇజా బెల్లె తెలిపింది. చదువుకునే రోజుల్లో ఈ భామకి లవ్ ఎఫైర్ ఉందట. తనతో కొంతకాలం డేటింగ్ చేశానని చెప్తోంది. ఆ తర్వాత విభేదాల కారణంగా విడిపోయామని చెప్తోంది ఈ భామ. అతడితో వినిపోవడం నా కెరీర్ కు మంచే జరిగిందని ఇజా బెల్లె తెలిపింది. అయితే.. ఈమె ఆసక్తికరమైన విషయం చెప్పింది.

 

ఇండియాలో వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉందని, కాబట్టి ఇక్కడి సాంప్రదాయాల్లోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఇంకా ౩సంవత్సరాలవరకు పెళ్లి ఆలోచన లేదని అంటుంది ఇజా బెల్లె.
 

మరింత సమాచారం తెలుసుకోండి: