క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ వ్యక్తిగత జీవితం పై ఎప్పుడు రూమర్లు లేవు. దీనికితోడు ఈ లెక్కల మాష్టారు ప్రతి విషయంలోను చాల లెక్కలు వేస్తూ వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాంటి సుకుమార్ ఎప్పుడు లేని విధంగా ఒక యంగ్ హీరోయిన్ ని ఇప్పుడు ప్రమోట్ చేస్తూ ఆమెకు గాడ్ ఫాదర్ గా మారడమే కాకుండా ఆమెకు అవకాశాలు ఇమ్మని తనకు తెలిసిన సర్కిల్ ద్వారా సుకుమారు రాయబారాలు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.   


నటించిన తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే కన్నడ హీరోయిన్ కృతి శెట్టికి ఇప్పుడు సుకుమార్ సపోర్ట్ లభించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.  సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ మూవీలో కృతి హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకుడుగా మారుతున్న ఈ మూవీకి కథను సుకుమార్ అందించాడు. 


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన రిలీజైన ప్రతి ప్రోమోలోనూ కృతి హైలైట్ కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి ఆమె పై చాల ఎక్కువగా ఉంది. చాకటి హావభావాలు ప్రదర్శిస్తూ కళ్ళతో నటిస్తున్న ఈమె ప్రతిభ చూసి సుకుమార్ ఫ్లాట్ అయినట్లు తెలుస్తోంది. 


ముఖ్యంగా ‘ఉప్పెన’ మూవీకి సంబంధించి ‘నీ కళ్ళు నీలి సముద్రం’ అంటూ కొనసాగే పాటలో కృతి శెట్టి కళ్ళతో అభినయించిన నటనను చూసి సుకుమార్ ఫ్లాట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ రికమెండేషన్ తో కృతిని నిఖిల్ నటించబోయే తర్వాత సినిమాకు కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమాకు సుకుమార్ మరొక శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మించబోయే ఈ చిత్రానికి ’18 పేజెస్’ అనే టైటిల్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: