కరోనా ఎఫెక్ట్ తో కొత్త సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. ఆ తర్వాత రాబోయే సినిమాల రిలీజ్ డేట్స్ లో క్లాషెస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి నాగార్జునతో వారసుల బాక్సాఫీస్ ఫైట్ తప్పదేమో అనిపిస్తోంది. 

 

కరోనా ఎఫెక్ట్ తో వరల్డ్ మూవీ ఇండస్ట్రీ షట్ డౌన్ అయిపోయింది. కొత్త సినిమాల రిలీజ్ లు ల్యాబ్ కే పరిమితమయ్యాయి. అయితే ఈ ప్రభావం నెల తర్వాత రిలీజ్ కాబోయే సినిమాలపై గట్టిగా పడబోతోంది. ఒకేసారి సినిమాలు రిలీజ్ కు సిద్ధమైతే రిలీజ్ డేట్స్ లో క్లాషెష్ తప్పవు. ఇప్పుడు ఈ సమస్య అక్కినేని హీరోల సినిమాలకు ఎదురుకాబోతోంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాలు రిలీజ్ లు క్లాష్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.  

 

ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తున్నాడు. నాగచైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలు చేస్తున్నాడు. అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ వైల్డ్ డాగ్ మేలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఇద్దరు వారసులు నాగచైతన్య, అఖిల్ సినిమాలు మేకి షిప్ట్ కాబోతున్నాయి. 

 

అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను ఏప్రిల్ లో లాస్ట్ లో రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు మే నెలకు వాయిదా వేశారు. మరోవైపు నాగచైతన్య లవ్ స్టోరీ మూవీ షూటింగ్ కూడా లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను మేకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇలా రిలీజ్ డేట్స్ డిస్టబెన్స్ కావడంతో తండ్రీకొడుకులు ఒకే నెలలో రాబోతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద నాగ్ పై చేయి సాధిస్తాడా.. వారసులు మెప్పిస్తారా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: