బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ టైటిల్ గా రౌద్రం రణం రుధిరం ఫిక్స్ చేశారు. టైటిల్ మాత్రమే కాదు ఈ టైటిల్ కు తగినట్టుగా అల్లూరి సీతారామరాజు రౌద్రం చూపిస్తూ నిప్పు కనికగా రామ్ చరణ్ పరుగెత్తుకు వస్తుండగా.. నీటితో రుధిరం అంటూ ఎన్టీఆర్ కనిపించాడు. ఈ ఇద్దరు చేసే రణంగా ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. 

 

తన సినిమాల్లో హీరో పాత్రని చాలా పవర్ ఫుల్ గా చూపించడంలో రాజమౌళి స్టైల్ వేరుగా ఉంటుంది. మోషన్ పోస్టర్ లో కూడా చరణ్ నిప్పుతో రావడం.. తారక్ నీళ్లతో రావడం అబ్బో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సినీ ప్రియులకు కూడా పోస్టరే సీటీమార్ అనేలా ఉంది. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇద్దరు తమ తమ పాత్రల్లో నట విశ్వరూపం చూపించారని తెలుస్తుంది. 

 

మోషన్ పోస్టర్ లోనే క్యారెక్టర్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో చెప్పాడు రాజమౌళి. మోషన్ పోస్టర్ లో చరణ్ మాత్రం అదరగొట్టాడు. అల్లూరిగా చరణ్ ఆహార్యం అదిరిపోయింది. కొమరం భీమ్ గా తారక్ కూడా సంచలనానికి సిద్ధమయ్యాడు. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఆర్.ఆర్.ఆర్ మరో పెద్ద పండుగ తీసుకురావడం ఖాయమని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కూడా సినిమాలో స్పెషల్ రరోల్ లో నటిస్తున్నారు. 8, 2021 న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. బాహుబలి తర్వాత ఆ సినిమాను మించేలా రౌద్రం రణం రుధిరం ఉంటుందని ఈ పోస్టర్ తోనే తారాస్థాయి అంచనాలు ఏర్పడేలా చేశాడు జక్కన్న. ఈ మోషన్ పోస్టర్ లో వెనుక  కీరవాణి ఆర్.ఆర్ కూడా అదిరిపోయింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: