సినిమా క్లైమాక్స్ కు చేరిందంటే ఇక శుభం కార్డు పడటమే తరువాయి. ఈ ఫార్మాట్ ను ఎవరూ మార్చలేరు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ చిత్రాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. క్లైమాక్స్ కు బ్రేకులేసి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు. 


కాజల్ అగర్వాల్ కెరీర్ క్లైమాక్స్ కు చేరిందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. చందమామ 34లో అడుగుపెట్టడంతో యంగ్ స్టర్స్ ఈమెను పక్కనపెట్టేశారని.. స్టార్ హీరోలు రిపీట్ చేేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే కెరీర్ క్లోజ్ అవుతోంది అనే మాటలు వినిపిస్తోన్న టైమ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంది కాజల్.

 

కాజల్ రీసెంట్ గానే ఆచార్య సినిమాకు సైన్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో చిరుతో జోడీ కడుతోంది కాజల్. అయితే మొదట ఈ మూవీలో త్రిషని హీరోయిన్ గా తీసుకున్నారు కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది త్రిష. ఇక ఈ చెన్నై బ్యూటీ వెళ్లిపోగానే మెగా ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముంబయి బ్యూటీ. 

 

కాజల్ తమిళ్, హిందీల్లోనూ భారీ సినిమాల్లో నటిస్తోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఇండియన్ 2లో హీరోయిన్ గా నటిస్తోంది. చందమామ మరోవైపు హిందీలో జాన్ అబ్రహాంతో కలిసి
ముంబయి సాగా చేస్తోంది. సో ఈ ప్రాజెక్ట్ చూస్తే కాజల్ హవా తగ్గలేదనే చెప్పొచ్చు. 

 

హీరోయిన్ల కెరీర్ లో గ్యాప్ వస్తే.. జర్నీకి కూడా బ్రేకులు పడతాయి. చాలామంది హీరోయిన్లు ఇలాగే గ్యాప్ తీసుకొని ఇంటికే పరిమితమయ్యారు. కానీ శ్రుతిహాసన్ మాత్రం గ్యాప్ ని ఓవర్ కమ్ చేసి మళ్లీ బిజీ అవుతోంది. స్టార్ ప్రాజెక్ట్స్ తో ట్రాక్ లోకి వచ్చేస్తోంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: