ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత మెల్లగా పెరుగుతుండడం వలన పలు దేశాలు లాకౌట్ ప్రకటించడం జరిగింది. ఇక ఈ వ్యాధి మరింతగా ప్రభలకుండా ఇటీవల మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 21 రోజుల పాటు దేశాన్ని పూర్తిగా లాకౌట్ చేస్తున్నాం అని, అప్పటి వరకు ప్రజలు ఎవరూ కూడా తమ తమ ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉంటే, తప్పకుండా మెల్లగా ఈ మహమ్మారిని మన దేశం నుండి వెళ్లగొట్టవచ్చని సూచించడం జరిగింది. అయితే మొదట్లో ఒకరోజు జనతా కర్ఫ్యూ ప్రకటించిన సమయంలో దాదాపుగా దేశ ప్రజలు అందరూ కూడా ప్రధాని సూచన మేరకు దానిని పాటించడం జరిగింది. అయితే ప్రస్తుతం 21 రోజులు లాకౌట్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ కొందరు ప్రజలు నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవల పేరుతో బయటకు వస్తూనే ఉన్నారు. 

 

కాగా మరోవైపు ఇటీవల విదేశాల నుండి వచ్చిన వారి లిస్ట్ బయటకు తీసి, వారిని జల్లెడ పట్టి వారికి కరోనా చెకప్ చేయించే పనిలో కూడా నిమగ్నం అయింది ప్రభుత్వం. అయితే మధ్య మధ్యలో కొందరు ప్రజలు ఊరికూరికే బయటకు వస్తూ ఉండడంతో, ఈ వ్యాధి మరింతగా ప్రబలే అవకాశం ఉందని, కావున ఇటీవల అటువంటి వారిపై గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. కొన్ని చోట్ల పోలీసులు కూడా సరైన కారణం లేకుండా బయటకు వస్తున్న వారిపట్ల లాఠీ ఝుళిపిస్తున్నారు. అయితే ఆ విధంగా బయటకు వస్తున్న వారిలో కొందరు అత్యవసర పరిస్థితులు కలిగిన వారు ఉన్నారని, కానీ మరికొందరు మాత్రం ప్రధాని, ప్రభుత్వం మాటను పెడచెవిన పెట్టి ఈ విధంగా బయట యథేచ్ఛగా తిరగడం వలన కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే అలా బయటకు వచ్చే వారిని ఆపేందుకు పోలీసులు, ఆర్మీ ఎవరూ అవసరం లేదని, డ్రోన్ కెమెరాలు ఉపయోగించి, వాటికి దెయ్యాల మాదిరిగా డ్రెస్ వేసి ప్రతి ఏరియాలో వదిలితే చాలు, వాటిని చూసి భయపడి ప్రజలు బయటకు రావడం మానేస్తారని టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: