సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోవడంతో తన ఫ్యామిలీతో కలిసి హాయిగా ఇంట్లో గడుపుతున్నారు. వాస్తవానికి ఈ పాటికి మహేష్ బాబు తదుపరి సినిమా మొదలు కావలసి ఉంది. ముందుగా వంశీ పైడిపల్లితో తన తదుపరి సినిమా చేయాలనుకున్న మహేష్, ఆ సినిమా కథ పూర్తిగా సిద్ధం కాకపోవడంతో ఇటీవల యువ దర్శకుడు పరశురామ్ పెట్ల చెప్పిన కథకు పచ్చ జండా ఊపారు. మే లో ముహూర్తం జరుపుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి మొదలు కానున్నట్లు టాక్. 

 

ఇకపోతే ఇటీవల యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్ బాబు, వరుసగా మూడవ విజయాన్ని అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ నమోదు చేసారు. అంతకముందు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను, ఆపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన మహేష్, సరిలేరు సక్సెస్ తో ఫ్యాన్స్ కు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మిలిటరీ మేజర్ గా మహేష్ బాబు ఈ సినిమాలో కనపరిచిన నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అంతకముందు చాలా రోజులుగా ఎక్కువగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ రోల్స్ లో

 

నటిస్తున్న మహేష్, ఒక్కసారిగా ఈ సినిమా ద్వారా మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్ పండించడం, యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలు ఈ సినిమా సక్సెస్ కు బాగా కలిసొచ్చాయి. ఇకపోతే ఈ సినిమా ని ఇటీవల ఉగాది పండుగ కానుకగా జెమినీటివి లో ప్రసారం చేయగా దీనికి ఏకంగా 23.4 టిఆర్పి రేటింగ్ వచ్చినట్లు కాసేపటి క్రితం వార్త బయటకు రావడం జరిగింది. కాగా అంతకముందు అత్యధిక రేటింగ్స్ అందుకుని ముందు స్థానంలో ఉన్న సినిమాలు బాహుబలి 2, 22.70, అలానే బాహుబలి 21.84 సినిమాలను వెనక్కు నెట్టి ఇంత భారీ స్థాయిలో రేటింగ్స్ సాధించి ముందువరుసలో నిలిచింది సరిలేరు సినిమా. దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అమితానందం వ్యక్తం చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: