ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కి 2018 రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన సినిమా మారి2. బాలాజీ మోహన్ దర్శకత్వంలో వచ్చిన మారి సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ మారి 2కు కూడా ఆయనే దర్శకుడు. మంచి క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ ని సాధించడంతో పాటు సినిమాలోని యువ శంకర్ రాజా స్వరపరచిన సాంగ్స్ కు కూడా యూత్, మాస్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ గురించి చెప్పుకోవాలి. 

 

ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా వ్యవహరించిన ఈ సాంగ్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 809 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు, 3 మిలియన్లకు పైగా లైక్స్ తో దిగ్విజయంగా దూసుకెళుతోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించిన టైగర్ జిందా హై సినిమాలోని స్వాగ్ సే స్వాగత్ సాంగ్ ప్రస్తుతం 817 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుండగా, రాబోయే మరికొద్దిరోజుల్లో రౌడీ బేబీ దానిని అధిగమించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలానే రాబోయే మరొక రెండు, మూడు నెలల్లో ఈ సాంగ్ తప్పకుండా 1 బిలియన్ వ్యూస్ అందుకోవడం ఖాయం అని అంటున్నారు సంగీత ప్రియులు. 

 

వాస్తవానికి ఈ సాంగ్ లో ఆకట్టుకునే ట్యూన్, లిరిక్స్ తో పాటు ప్రభుదేవా ఎంతో వెరైటీ గా కంపోజ్ చేసిన డాన్స్ మూమెంట్స్ కూడా సాంగ్ కు ఈ స్థాయిలో సక్సెస్ సాధించి, వ్యూస్ రావడానికి కారణం అని, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సాంగ్ మరిన్ని మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు. ఇక ఈ సాంగ్ తో పాటు సాయి పల్లవి, వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాలోని వచ్చిండే సాంగ్ కూడా మరోవైపు 246 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుండడంతో మొత్తంగా ఈ రెండు సాంగ్స్ తో సాయి పల్లవి విపరీతమైన క్రేజ్ ని సంపాదించింది అని చెప్పాలి.....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: