ఇప్పటికే కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో దేశ దేశాలు అన్ని కూడా తీవ్రంగా భయాందోళనలతో వణికిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి మరింతగా వ్యాప్తం కాకుండా ఉండేందుకు మన దేశంతో పాటు చాలావరకు దేశాలు కొన్ని వారాల పాటు లాకౌట్ ప్రకటించగా, మన దేశాన్ని కూడా ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఏకంగా 21 రోజులపాటు లాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు అందరూ కూడా గట్టిగా ఈ లాకౌట్ ని పాటించి, ఎవరి ఇళ్లలో వారు ఉండాలని, అలానే కేవలం ఏదైనా అత్యవసర పని ఉంటే మాత్రమే తమ ఇళ్ల నుండి బయటకు రావాలని, అది కూడా కేవలం ఒక ఇంటి నుండి ఒక్కరు మాత్రమే రావాలని, ప్రభుత్వం సూచించిన సమయంలోనే బయటకు వచ్చి నిత్యావసరాల వంటివి కొనుగోలు చేయాలి ప్రధాని విజ్ఞప్తి చేసారు. 

 

ఇక ఈ వ్యాధిని నివారించడానికి ప్రతి ఒక్కరు రోజులో వీలైనన్ని ఎక్కువ సార్లు తమ చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బు తో లేత శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోవాలని పలువురు అధికారులు, డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక ఈ మహమ్మారి ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాకౌట్ కావడంతో మన ఆర్ధిక వ్యవస్థ చాలావరకు నష్టాల్లోకి కూరుకుపోయే పరిస్థితి కనపడుతోందని, అందువలన ఈ కరొనపై పై అందరం గట్టిగా యుద్ధం చేసి వీలైనంత త్వరగా దీనిని మన దేశం నుండి తరిమికొట్టాలని ప్రధాని కోరారు. అందులోభాగంగా నిన్న రాత్రి 9 గంటలకు, ఒక 9 నిమిషాలపాటు దేశప్రజలు అందరూ కూడా ఇంట్లో లైట్స్ ఆర్పేసి చేతిలో కొవ్వొత్తులు, టార్చ్ లైట్స్, మొబైల్ ఫోన్ లైట్స్ వంటివి వేసి లైట్ ఫర్ ఇండియా ఉద్యమంలో భాగం కావాలని పిలుపునివ్వగా, దేశ ప్రజలు అందరూ కూడా దానికి మద్దతుపలికి ఎంతో విజయవంతం చేసారు. 

 

ఇక ఎప్పుడూ ప్రతి విషయం లోను కొంత విభిన్నంగా వ్యవహరించే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిన్నటి లైట్స్ ఫర్ ఇండియా కార్యక్రమం సందర్భంగా నోట్లో సిగరెట్ పెట్టుకుని, దానిని లైటర్ తో వెలిగిస్తున్న ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అది చూసిన కొందరు నెటిజన్లు, వామ్మో వర్మ నువ్వు సామాన్యుడివివి కాదు స్వామి, ఇటువంటి సమయంలో కూడా నీకు ఇటువంటి తెలివితేటలు ఎలా వస్తాయి, నిజంగా నీకో దండం అంటూ ఆయన పెట్టిన పోస్ట్ పై తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: