ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా... కరోనా.. . కరోనా వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు కూడా మూతపడిన సంగతి అందరికి తెలిసిందే కదా... ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందడంతో లాక్ డౌన్ అమలు చేసింది భారత కేంద్ర ప్రభుత్వం. అన్ని దేశాలలో కూడా లాక్ డౌన్ నిబంధన అమలు చేయడం జరిగింది. ఇక మన భారతదేశ విషయానికి వస్తే మూడు వారాల నుంచి లాక్ డౌన్ విధానం అమలు అవుతుందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ తరుణంలో ప్రజలు అందరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. 

 


ఇక సినీ రంగానికి చూస్తే నటులు అందరూ కూడా లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో హాయిగా వాళ్ల కాలనీ గడిపేస్తున్నారు. మరి కొందరు నటీమణులు అయితే వాళ్ల ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నారు. మరికొంత మంది నటీనటులు అయితే వాళ్ల ఖాళీ సమయంలో స్క్రిప్ట్ లో రాస్తూఅందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా హీరోయిన్ నిత్యామీనన్ తన ఖాళీ సమయంలో స్క్రిప్ట్స్ రాస్తున్నానని  తెలిపింది. అలాగే తాను ఉండే చోట ఏర్పడే పరిమాణాలను గమనిస్తూ.. తనకు వచ్చిన ఆలోచనలతో స్క్రిప్ట్ లు రాస్తున్నట్లు నిత్యామీనన్ తెలియచేసింది.  అలాగే రోజురోజుకీ కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండే అవకాశలు చాలా ఉన్నాయని అందుకు అందరం ఇంట్లో ఉండడం చాలా మంచిదని ఆమె అందరికీ తెలియజేసింది.

 


ఇక మళ్లీ షూటింగులతో బిజీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అని అందుకే ఈ సమయాన్ని కథలు రాయడానికి ఉపయోగిస్తున్నానీ నిత్యామీనన్ తెలియజేసింది. అలాగే ఇలా కథలు రాయడం నాకు చాలా స్వేచ్ఛగా అనిపిస్తుందని నిత్య తన భావన తెలియజేసింది. ఇలా స్క్రిప్టు రాయడంతో పాటు కొత్త భాష కొత్త సంగీత పాటలు కూడా నేర్చుకుంటున్నాను అని నిత్యామీనన్ తెలియజేసింది. ఏది ఏమైనా ఇంట్లో ఉండి మీరు ఆరోగ్యంగా ఉండండి అలాగే పక్కవారిని ఆరోగ్యంగా ఉంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: