మళయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారనే వార్తలు కొన్ని రోజులగా మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీలో బాల‌కృష్ణ రానా ద‌గ్గుబాటి న‌టిస్తార‌నే ప్రచారం కూడ జరుగుతోంది. అయితే బాల‌కృష్ణ ఈ మల‌యాళ రీమేక్‌లో న‌టించడానికి సున్నితంగా తిర‌స్క‌రించాడని వార్తలు వస్తున్నాయి. 


త్రివిక్రమ్ కు అతి సన్నిహితమైన సితార ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్‌ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈమూవీకి సంబంధించి బాలకృష్ణ నటిస్తే ఈమూవీ ఘనవిజయం సాధిస్తుందని త్రివిక్రమ్ సలహాతో ఈమూవీ నిర్మాతలు బాలయ్యతో రాయబారాలు చేసారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న  ఉంటుందని అనుకున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈమూవీ రీమేక్ రైట్స్ ను 3 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 


అయ్యప్పన్ కోషియమ్ కథ చూసినట్లయితే ఒక హీరోకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మరొక  హీరోకు తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇక క్లైమాక్స్ ను ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో తీస్తే ఖచ్చితంగా టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాను తిరష్కరించే అవకాశం ఉంది అని అంటున్నారు. అలా అని క్లైమాక్స్ ను మార్చితే సినిమా జీవం పోయినట్లవుతుందని రీమేక్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించినా కూడా ఏదో ఒకచోట లోటు జరగడం ఖాయం అన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని బాలయ్య ఈఆఫర్ ను తిరస్కరించి నట్లు వార్తలు వస్తున్నాయి. 


అయితే ఈసినిమాలో బాలయ్య తప్పుకున్నా రానా మాత్రం ఈసినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈసూపర్ హిట్ రీమేక్‌లో బాలయ్య ప్లేస్‌ లో వెంకటేష్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ తమిళంలో హిట్ అయిన ‘నారప్ప’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆసినిమా పూర్తి చేసుకున్న తరువాత ఈరీమేక్‌ లో యాక్ట్ చేయడానికి వెంకీ తన అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మలయాళ వెర్షన్ లో బిజు మీనన్ పృథ్వీరాజ్ నటించారు. వీళ్లిద్దరు మధ్య నడిచే ఈగో వార్ రక్తికట్టడంతో ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయినప్పటికీ ఈమూవీ తన అభిమానులకు ఏమాత్రం నచ్చదని బాలయ్య అభిప్రాయం అని అంటున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: