డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ ఛాన్స్ ను వదిలేశాడట. బీటౌన్ ను షేక్ చేసిన సూపర్ సక్సెస్ సిరీస్ లో నటించేందుకు బాహుబలి స్టార్ నో చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. బోర్ కొట్టడం వల్లే యంగ్ రెబల్ స్టార్ ఆ ఎక్సలెంట్ ఆఫర్ ను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ప్రభాస్ వదిలేసిన ఆ బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా.. 

 

బాహుబలి అద్భుత విజయం తర్వాత ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ లో ఆకాశాన్ని తాకుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ బీటౌన్ నుండి క్రేజీ ఆఫర్లు వచ్చాయట. కానీ డార్లింగ్ మాత్రం తెలుగు సినిమాలకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. బాలీవుడ్ లో బంపర్ హిట్ సిరీస్ కు ఈ పాన్ ఇండియా స్టార్ సింపుల్ గా నో చెప్పినట్టు తెలుస్తోంది. 

 

యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మించిన ధూమ్ సిరీస్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన మూడు సిరీస్ లు అద్భుత విజయం సాధించాడు. ఈ సిరీస్ లో రానున్న నాలుగవ చిత్రానికి ప్రభాస్ ను సంప్రదించారట. ఇందుకు డార్లింగ్ నో చెప్పడంతో ఆ ప్లేస్ లో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ చేతికి వెళ్లిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 

 

ధూమ్ సిరీస్ లో హీరో కంటే విలన్ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. దాన్ని విలన్ పాత్ర అనే కంటే యాంటీ హీరో అనడం కరెక్ట్. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉండే హీరో పాత్రకు భారీ యాక్షన్ సీక్వెన్స్, చేజింగ్ లకు ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు.  ధూమ్ జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్,అమీర్ ఖాన్ సర్ ప్రైజింగ్ స్టంట్స్ చేసి అబ్బురపరిచారు. అయితే వరుసగా యాక్షన్ చిత్రాలు చేసిన ప్రభాస్ కు ఈ ఛాన్స్ పెద్దగా కిక్ ఇవ్వలేదట. అందుకే ధూమ్ 4ను వదిలేసినట్టు తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ కు ఈ క్యారెక్టర్ కొట్టిన పిండే. 

మరింత సమాచారం తెలుసుకోండి: