టాలీవుడ్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు అనే చెప్పాలి. ముందుగా రెండేళ్ల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమా మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఆ సినిమాని హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మించగా, ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్, తదుపరి త్రివిక్రమ్ తో నెక్స్ట్ సినిమాని చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు మరొకసారి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రకటన ఇటీవల రావడం జరిగింది. 

 

అయితే ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని అనుకుంటున్నారని, అలానే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మంచి కమర్షియల్ హంగులతో తెరకెక్కనుందని అంటున్నారు. ఇటీవల ఈ సినిమా స్టోరీ ని ఎన్టీఆర్ కు చెప్పిన త్రివిక్రమ్, అందులో ఇంకొన్ని అదిరిపోయే యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ ని జోడించినట్లు టాక్. ఇకపోతే ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల కొందరు హీరోయిన్ల పేర్లు బయటకు రాగా, రెండు రోజుల క్రితం నుండి మాత్రం ఇందులో ఫిదా భామ సాయి పల్లవి ఖాయం అయినట్లు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమాలో ఆమెతో పాటు మరొక హీరోయిన్ కూడా ఉంటుందని లేటెస్ట్ టాక్. 

 

అరవింద సమేత లో మరొక హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈషా రెబ్బనే మళ్ళి ఈ సినిమాలోని సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కు తీసుకోవాలని చూస్తున్నారట త్రివిక్రమ్, వాస్తవానికి ఆ సినిమాలో ఈషా క్యారెక్టర్ చాలా చిన్నదని, అయినప్పటికీ ఆ అమ్మాయి తన క్యారెక్టర్ లో ఎంతో అద్భుతంగా నటించిందని, అందుకనే తదుపరి ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు ఆమెను మరొక్కసారి తీసుకునేందుకు సిద్ధం అయ్యారట త్రివిక్రమ్. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: