పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల తర్వాత ఏకంగా మూడు సినిమాలకు ఒప్పుకొని తన అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపారు. తాజాగా వకీల్ సాబ్ చిత్రం లో ఓ లాయర్ గా నటించిన పవన్ కళ్యాణ్... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరుపాక్ష అనే సినిమాలో ఔరంగజేబు కాలంలో ఓ దొంగగా నటించనున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం నిర్మిస్తుండగా... ఎం.ఎం.కీరవాణి సంగీత బాణీలు అందిస్తున్నారు.


మొదటిలో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ విరూపాక్ష సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆ వార్తలన్నీ ఒట్టి బూటకాలని తేలాయి. జాక్వలిన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత కీర్తి సురేష్ సినిమా లోని మొదటి హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరిగింది. మరోవైపు రెండవ హీరోయిన్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన వేదం సినిమాలో వేశ్య పాత్రలో ఒదిగిపోయిన అనుష్క శెట్టి ని ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇది కూడా ఒక పుకారే అని తేలింది. అయితే మొట్ట మొదటి హీరోయిన్ ఎవరు అనేది ఇంకా పూర్తి క్లారిటీ రాకపోయినప్పటికీ... సెకండ్ హీరోయిన్ గా నివేదా పేతురాజ్ ఎంపిక కావడం జరిగిందని సినీ విశ్వసనీయ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది.


మొన్నామధ్య విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సంపాదించుకున్న అల వైకుంఠపురము లో నివేదా పేతురాజ్ ఒక పాత్రలో నటించి అందరినీ తనవైపు తిప్పుకున్నదన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఈమె పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకోవడం ఆమె అదృష్టం. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ డ్రామా కచ్చితంగా ఓ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఊహాగానాలు చేసుకోవడంలో పెద్ద తప్పేమీ లేదని ప్రేక్షక అభిమానులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: