పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోలుగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా గోపాల గోపాల. 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడైన శరత్ మరార్ టాలీవుడ్ కు నిర్మాతగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తోనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నిర్మించిన శరత్ మరార్, దానితో పరాజయాన్ని మూట కట్టుకున్నారు. 

IHG

అనంతరం పవన్ తో మరొకసారి ఆయన నిర్మించిన కాటమరాయుడు సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆపై ఇటీవల ప్రేమకు రెయిన్ చెక్ అనే ఒక చిన్న సినిమా నిర్మించిన శరత్ మరార్, అతి త్వరలో మరొకసారి పవర్ స్టార్ తో సినిమా చేయనున్నట్లు లేటెస్ట్ గా టాలీవుడ్ వర్గాల టాక్. మొదటినుంచి పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణంలో ఎన్నో ఏళ్ల పాటు ఆయనతో కలిసి స్నేహంగా మెలిగిన శరత్ మరార్, పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేస్తా అని, ఎందాకైనా వస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్, దాని అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నారు. 

 

కాగా ఈ మూడు సినిమాల తర్వాత పవన్, త్రివిక్రమ్ తో కానీ లేదా కిషోర్ కుమార్ పార్ధసాని తో గాని వర్క్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు పక్కాగా నిర్మాతగా వ్యవహరించేది మాత్రం శరత్ మరార్ అని అంటున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం పవన్ తో మాట్లాడి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట శరత్ మరార్. ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలతో పవన్ కు పెద్ద సక్సెస్ ని అందివ్వలేకపోయానని, అయితే అతి త్వరలో తాను పవన్ తో నిర్మించనున్న సినిమాతో తప్పకుండా ఆయనకు మంచి హిట్ రూపంలో గిఫ్ట్ ఇస్తానని శరత్ మరార్ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం హరీష్ శంకర్ సినిమా అనంతరం శరత్ మరార్ తో పవన్ సినిమా చేస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: