‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత మహేష్ నటించబోయే లేటెస్ట్ మూవీకి పరుశు రామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈసినిమా కథ అంతా అమెరికా నేపధ్యంలో ఉండే విధంగా పరుశు రామ్ కథను వ్రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ పరుశు రామ్ కు ఓకె చెప్పిన తరువాత కరోనా విలయతాండవంతో అమెరికా అట్టుడికి పోతున్న పరిస్థితులలో ఇప్పట్లో అమెరికాలో సినిమాల షూటింగ్ లు చేసే పరిస్థితి లేదు. 


దీనితో ఈమూవీ కథను పూర్తిగా మార్చి కథ అంతా మన ఇండియాలోనే జరుగుతున్నట్లుగా పరుశు రామ్ ప్రస్తుతం మహేష్ సూచనలతో ఈ మూవీ కథలో మార్పులు చేస్తున్నట్లు టాక్. దీనికితోడు ఇండియాను కూడా కరోనా అతలాకుతలం చేస్తున్న పరిస్థితులలో మహేష్ సినిమాకు బడ్జెట్ కోతలు విధిస్తూ ఈమూవీని వీలైనంత తక్కువ ఖర్చులో రిచ్ గా ఎలా తీయవచ్చు అన్న ఆలోచనలు ప్రస్తుతం మహేష్ పరుశు రామ్ ల చర్చలలో కొనసాగుతున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో పరుశు రామ్ కు వచ్చిన ఒక ఆలోచన ఏకంగా మహేష్ కు షాక్ ఇచ్చినట్లు టాక్. ఈమూవీ కథ ప్యూర్ లవ్ స్టోరీ కావడంతో కోట్లు ఖర్చుపెట్టి టాప్ హీరోయిన్ ను మహేష్ పక్కన నటింప చేసే కన్నా కొంతకాలం క్రితం యూత్ లో క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మళయాళ బ్యూటీ ప్రియా వారియర్ ను మహేష్ పక్కన హీరోయిన్ గా ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పరుశు రామ్ కు రావడంతో ఆ ఆలోచనను పరుశు రామ్ ధైర్యంగా మహేష్ కు షేర్ చేసినట్లు తెలుస్తోంది.  

వాస్తవానికి కాస్త కటింగ్ ఆలోచనల రీత్యా ప్రియా వారియర్ ఎంపిక ఆలోచింప తగ్గదే అయినా 45 సంవత్సరాలు పై బడిన మహేష్ పక్కన పట్టుమని 20 సంవత్సరాలు కూడ లేని ప్రియా వారియర్ ఏమి బాగుంటుంది అన్న సందేహం ఏకంగా మహేష్ కు వచ్చినట్లు టాక్. దీనితో ఆమె ఎంపిక విషయం మహేష్ పరుశు రామ్ ల ప్రాధమిక చర్చలలోనే తేలిపోయింది అంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుంటున్నాయి. కరోనా ప్రభావంతో చిత్ర పరిశ్రమలో ప్రతి విషయం లోను పొదుపు పాటించవలసిన పరిస్థితులు ఏర్పడటంతో ప్రస్తుత పరిస్థితులలో క్వాలిటీ చూపెడుతూ టాప్ హీరోలతో సినిమాలు తీయడం కష్టం అన్నఅభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: