ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ ద‌ర్శ‌కులు అంద‌రూ స్పందిస్తున్నారు.  విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఏంటంటే టాలీవుడ్‌లో ఎక్కువుగా గాసిప్‌లు రాయ‌డంతో పాటు హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కుల ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను బాగా కెలికి కెలికి ఊహాజ‌నిత గాసిప్‌లు రాసుకునే ఓ వెబ్ సైట్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యాంటీగా ఓ ఆర్టిక‌ల్ రాసింది. దీనిపై సుదీర్ఘంగా స్పందించిన విజ‌య్ వీడియోలో ఆ గాసిప్ వెబ్‌సైట్ తాట తీసేసి.. గాలి తీసేశాడు. 

 

స‌ద‌రు వెబ్‌సైట్ వార్త ప్రింట్ అవుట్ తీసి మ‌రీ పేరు చెప్ప‌కుండా  ఆ గ్రేట్ వెబ్‌సైట్‌ను ఏకేశాడు. ఇది కాసేపు ప‌క్క‌న పెడితే ఈ విష‌యంలో విజ‌య్‌కు మ‌ద్ద‌తుగా మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు, మ‌హేష్‌బాబు నుంచి స్టార్ ద‌ర్శ‌కులు కొర‌టాల‌, అనిల్ రావిపూడి, హ‌రీష్ శంక‌ర్ లాంటి వాళ్లు అంద‌రూ ఏక‌మై మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఓ వైపు సోష‌ల్ మీడియాలో వార్ ఉధృతంగా న‌డుస్తోంది. ఈ టైంలో హాట్ యాంక‌ర్ అన‌సూయ చేసిన పోస్టు విజ‌య్ అభిమానుల‌ను రెచ్చ‌గొట్టేలా ఉంద‌ని అంటున్నారు.

 

అన‌సూయ త‌న ట్విట్ట‌ర్‌లో మ‌న‌దాకా వ‌స్తే గాని బుద్ధి రాద‌న్న మాట అన్న డైలాగ్ వాడింది. గ‌తంలో ఆమెపై సోష‌ల్ మీడియాలో ప‌లు విమ‌ర్శ‌లు, వార్త‌లు వ‌చ్చాయి. అప్పుడు ఎవ్వ‌రూ స్పందించ‌లేదు.. ఇప్పుడు విజ‌య్ విష‌యంలో అంద‌రూ స్పందిస్తున్నార‌న్న ఆవేద‌న‌తోనే ఆమె ఈ ట్వీట్ చేసింద‌న్న టాక్ అయితే వ‌స్తోంది. అయితే విజ‌య్ విష‌యంలో ఇంత ర‌చ్చ జ‌రుగుతోన్న వేళ ఆమె రెచ్చ‌గొట్టేలా ఈ ప‌దం వాడ‌డంతో విజ‌య్ అభిమానులు సోష‌ల్ మీడియాలో అన‌సూయ‌ను టార్గెట్‌గా చేసుకుని తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డుతున్నారు. 

 

ఈ టైంలో కనీసం స‌పోర్ట్ చేయ‌కుండా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు క‌దా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో ?  చూడాలి. అన‌సూయ ఈ విష‌యంలో అన‌వ‌స‌రంగా కెలుక్కున్న‌ట్ల‌య్యింది.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: