టాలీవుడ్ లో ఇప్పుడు జనాలు అందరూ లాక్ డౌన్ లో ఉండిపోయారు. ఎవరూ కూడా సినిమాలు చేయడం లేదు. మార్చి 23వ తేదీ నుంచి అన్ని థియేట‌ర్లు బంద్ అయిపోయాయి. ఇక మాల్స్ సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ సినిమా షూటింగ్ లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ?  తెలియ‌ని ప‌రిస్థితి. ఇక టాలీవుడ్ లో చిన్న హీరోలు... పెద్ద హీరోలు ఎవరు అయినా సరే సినిమాలకు దూరంగానే ఉన్నారు బయటకు రావడం లేదు. చాలా మంది హోమ్ క్వారంటైన్‌లో ఏదో ఒక ప‌ని చేస్తోన్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది పక్కన పెడితే... ఇప్పుడు టాలీవుడ్ లో వేడుకలు జరిగితే అవి చాలా సైలెంట్ గా జరుగుతున్నాయి. ఏ వేడుకను అయినా సరే చాలా సైలెంట్ గా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

ఇప్పుడు నితిన్ పెళ్లి చేసుకోవాడానికి లాగే ప్రయత్నం చేస్తున్నాడు. నిఖిల్ పెళ్లి ఇలాగే సైలెంట్ గా జరిగింది. ఏ హడావుడి లేకుండా అతను వివాహం చేసుకున్నాడు. దిల్ రాజు వివాహం కూడా ఇలాగే చేసుకున్నారు. ఇప్పుడు నితిన్ సైతం కేవలం అతి కొద్ది మందిని మాత్రమే పిలిచి వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని, త్రివిక్రమ్ ని, హను రాఘవపూడి ని మాత్ర‌మే పిలుస్తాడు అని సమాచారం. 

 

అలాగే హీరోయిన్ రష్మిక మంద‌న్న‌ ను కూడా పిలుస్తాడు అని సమాచారం. త్వరలోనే వీరు అందరికి ఆహ్వానాలు కూడా వెళ్తాయి అని వాళ్ళు అందరూ పెళ్ళికి రావడం ఖాయమని అంటున్నారు. ఇక కొందరు నిర్మాతలు కూడా ఈ పెళ్ళికి వచ్చే సూచనలు ఉన్నాయని తెలుస్తు౦ది. కాగా నితిన్ ప్రస్తుతం ఏ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్వరలోనే అతను రెండు సినిమాలను ఫైనల్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: