రష్మిక మందన.. ఛలో సినిమాలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గీత గోవిందం సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది ఈ కన్నడ బ్యూటి. ఇక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కూడా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో రష్మిక ముందు వరసలో ఉందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇటీవల మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. అలాగే మరోవైపు యంగ్ హీరో నితిన్తో భీష్మలో కూడా నటించింది.
ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. దీంతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే.. రష్మిక లిప్లాక్ సీన్లు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా డేరింగ్గా ముందుకు వెళ్తుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గీత గోవిందం సినిమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లిప్లాక్ చేయడంపై అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, ఎన్నో విమర్శులు కూడా అందుకుంది. కానీ, గీత గోవిందం ఊహించిన విజయాన్ని అందుకోవడం, వంద కోట్ల వసూళ్లు రాబట్టడంతో విజయ్ దేవరకొండ, రష్మిక జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది.
దాంతో మళ్లీ డియర్ కామ్రేడ్లో జతకట్టారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా గీత గోవిందం మంచి సక్సెస్ సాధించడంతో డియర్ కామ్రేడ్ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాలోనూ విజయ్తో రష్మిక లిప్లాక్ సీన్ హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా రష్మిక ఫ్యాన్స్ లిప్ లాక్పై ఫైర్ అవుతూ ఆమెను ట్రోల్ కూడా చేశారు. కానీ, రష్మిక ఇలాంటి ట్రోలింగ్స్కు, విమర్శలకు కరెక్ట్గా సమాధానం ఇచ్చింది. ముద్దు సన్నివేశాల్లో నటించడం గురించి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది. ముద్దు సన్నివేశాలను నటన నుంచి వేరుగా చూడలేం. కోపం, బాధ తరహాలో ముద్దు కూడా ఒక ఎమోషనే. కాబట్టి నటిగా అన్ని ఎమెషన్లను పలికించాలి.. అందుకే ముద్దు సీన్లలో నటించానని రష్మిక స్పష్టం చేసింది.