మన తెలుగులో సినిమాలు ఎక్కువగా చేయకపోయినా సరే సాయి పల్లవికి మాత్రం మంచి క్రేజ్ అనేది ఉంటుంది. కేరళ - తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కుగ్రామంలో జన్మించిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో ఒక్క సారిగా తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే తిరుగులేని పాపులర్ అయ్యింది. సాయి పల్లవి ఫిదా సినిమాతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసి పడేసింది. సాయి పాప సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తారు అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె మన తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఇక ఇప్పుడు ఆమె నాగ చైతన్య హీరో గా ఒక సినిమా చేస్తోంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి తెలంగాణా అమ్మాయి గా నటిస్తుంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడుతుందట. శేఖర్ కమ్ముల తన సినిమాల్లో హీరో, హీరోయిన్లను నటనతో ఎలా పిండేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో ఆమె చైతు కి లిప్ లాక్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. వర్షం లో ఒక సీన్ ఉంటుంది అని ఆ సీన్ లో ఆమెచైతు కి లిప్ లాక్ ఇస్తుంది అని సమాచారం. దీనిపై త్వరలోనే ఒక లుక్ ని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
దీనికి సంబంధించి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఆమె ఇప్పటి వరకు లిప్ లాక్ ఎక్కడా ఇవ్వలేదు. దీనితో ఆమె ఈ సినిమాలో లిప్ లాక్ చేస్తుంది అనే వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. మారి ఆమె ఏ విధంగా లిప్ లాక్ ఇస్తుందో గాని అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.